ఎంఎస్. రామయ్య చారిటబుల్ ట్రస్ట్ సేవలు ప్రశంసనీయం
677 మంది పారిశుద్ధ్య కార్మికులకు నిత్యవసర వస్తువులు. పంపిణీ
స్టాఫ్ రిపోర్టర్ విశాఖపట్నం (పెన్ పవర్)
కరోనా విపత్తులో ఎమ్మెస్ రామయ్య చారిటబుల్ ట్రస్ట్ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని పెందుర్తి శాసనసభ్యులు అన్నం రెడ్డి అదీప్ రాజ్ అన్నారు.., బుధవారం వేపగుంట 6 వ జోన్ కార్యాలయం లో .677 మంది పారిశుద్ధ్య కార్మికులకు,,పలువురు డ్రైవర్లకు ఎమ్మెల్యే చేతులమీదుగా నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు,,,,ఈ సందర్బంగా ఎమ్మెల్యే అదీప్ రాజు మాట్లాడుతూ,, ఎమ్మెస్ రామయ్య చారిటబుల్ ట్రస్ట్ కార్మికులకు., నిరాశ్రయులకు అల్పాహారం.. భోజన సదుపాయం కల్పిస్తున్నారన్నారు.. తాజాగా 677 మంది పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర వస్తువుల పంపిణీ చేయడం భినందనీయమన్నారు., దాత మొగ్గ సీతా రామయ్య, మాట్లాడుతూ ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ,, ఈరోజు పారిశుద్ధ్య కార్మికులకు నిత్యవసర వస్తువులు అందజేయడంతో పాటు... అనేక మంది అన్నార్తులకు తమ సంస్థ తరఫున చేయూతను అందిస్తున్నామన్నారు జీవీఎంసీ అదనపు కమిషనర్ విశ్వనాద్ సన్యాసి రావు మాట్లాడుతూ,, ఇటువంటి విపత్తులో దాతల సేవలు ప్రశంసనీయమన్నారు....అందరి సహకారంతోనే కరోనా ను అదుపు చేసుకోగలిగా మన్నారు..... ఈ కార్యక్రమానికి జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి.. వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు సమన్వయ కర్త గా వహించగా .స్థానిక నాయకులు పాశర్ల ప్రసాద్ . జోనల్ కమిషనర్ ఎన్.. వెంకట రమణ... సహాయ మెడికల్ అధికారి లక్ష్మి తులసి.. సహాయ సిటీ ప్లానర్ భాస్కర్.. దాతలు.. మొగ్గ సీతా రామయ్య.(వేపగుంట ). రమేష్ గుప్తా.(.అనకాపల్లి ) బ్రహ్మ నంద రెడ్డి.(వి కన్వెన్షన్ ) ఎం. .గోపాల్ రావు గణేష్..పోలి నాయుడు.. డబ్బీరు వెంకట రావు.. రౌతు గోవిందా రావు..
సత్యానంద్ తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment