నిత్యావసర సరుకుల పంపిణీ చేసిన వైసిపి సీనియర్ నాయకులు, ఎం.ఎస్ఆ.ర్, మెరైన్ అధినేత ముదునూరి సతీష్ రాజు
పెన్ పవర్ , ఐ.పోలవరం ప్రతినిధి కే. వేణు కుమార్
గత నెల రోజుల పాటు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ తో లాక్ డౌన్లో ఉన్న విధి నిర్వహణలో 24 గంటలు పని చేస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ఐ.పోలవరం మండలం ఎదురులంక గ్రామానికి చెందిన వైసిపిసీనియర్ నాయకులు, ఎం.ఎస్ఆ.ర్, మెరైన్ అధినేత ముదునూరి సతీష్ రాజు మంగళవారం తను పదిమందికి సాయి పడేలా ఉండాలనే కృతనిశ్చయంతోవిధినిర్వహణలో ఉన్న పాత్రికేయులకు బియ్యం, నిత్యవసర వస్తువులు, మాస్కులు, శానిటేషన్ పంపిణీ చేశారు. అలాగే ఐ.పోలవరం మండలం లో గ్రామవాలంటీర్లకు కూడా నిత్యావసర వస్తువుల పంపిణీ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మండలంలో ఉన్న పేద ప్రజలకు ఈ నిత్యవసర వస్తువులు పంపిణీ చేయడం జరుగుతుందని సతీష్ రాజు అన్నారు. పేద ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ భరోసా ఇచ్చిన ఏకైక వ్యక్తి ముదునూరు సతీష్ రాజు అని మండలంలో ఉన్న ప్రజలు సతీష్ రాజు కి ధన్యవాదాలు తెలిపారు.
No comments:
Post a Comment