Followers

రాష్ట్ర ఎన్నికల కమిషనర్  రమేశ్ కుమార్ కు కన్నా లేఖ

రాష్ట్ర ఎన్నికల కమిషనర్  రమేశ్ కుమార్ కు కన్నా లేఖ


అమరావతి, పెన్ పవర్ 



కరోనా లాక్ డౌన్ కారణంగా  ఏపీలో 1000 రూపాయల చొప్పున పంపిణీ చేసిన సంగతి తెలసిందే. దీనిపై ఏపీ బీజేపీ అగ్రనేత కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు లేఖ రాశారు. 
పేదలకు ప్రకటించిన వెయ్యి రూపాయల ఆర్థికసాయాన్ని వైసీపీ అభ్యర్థులు పంపిణీ చేస్తున్నారని తన లేఖలో ఆరోపించారు.
ఆ డబ్బును వైసీపీ పంపిణీ చేస్తున్నట్టుగా ప్రచారం చేస్తున్నారని తెలిపారు. వైసీపీ అభ్యర్థులపై అనర్హత వేటు వేసి జైలు శిక్ష విధించాలని కోరారు.
 ఇలాంటి సంక్షోభ సమయంలో స్వార్థ రాజకీయాలు తగవని వైసీపీకి హితవు పలికారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...