ఆకట్టుకున్న కరోనా అవగాహన చిత్రాలు
పెన్ పవర్, ఆత్రేయపురం ప్రతినిధి చిరంజీవి
మండలం ర్యాలిగ్రామంలో కరోనా ఎలా వ్యాప్తి చెందుతుంది దాని నిర్మూల న కు ఎవరు ఎలా పాటు పడుతున్నారో ప్రజలలో అవగాహన కల్పించటానికి శ్యామ్ జాదుగర్ మ్యాజిక్ ఫ్యామిలీ వేయించిన చిత్రాలు ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి అని ఆత్రేయపురం మండల అధికారి నాతి బుజ్జి అన్నారు. మనం అందరం తప్పని సరిగా మాస్క్ లు ధరించి, సామాజిక దూరం పాటించి ఇంటికి పరిమితి అయినపుడు మాత్రమే కరోనా ను అదుపుచేయ గలమని అన్నారు. ఈ సందర్భంగా గా కరోనా కు భయపడకుండా విధులు నిర్వహిస్తున్న వైద్యాధికారి డాక్టర్ ఎన్. సునీత, సెక్రెటరీ కృష్ణ, గ్రామ రెవెన్యూ అధికారి వాసు, చిత్రకారుడు కుమార్, సబ్ ఇన్స్పెక్టర్ నరేష్ లను నాతి బుజ్జి ఘనం గా సన్మానించారు. అనంతరం మాస్క్ లు, భోజన పొట్లాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో గోగుల నాగేశ్వరరావు, పసలపూడి కుమార్, నాగేష్, కేశవ స్వామి ఆలయ అధికారి కృష్ణ చైతన్య, శ్యామ్, మోహిత్ లు పాల్గొన్నారు.
No comments:
Post a Comment