స్టాఫ్ రిపోర్టర్ విశాఖపట్నం ( పెన్ పవర్)
కరోనా వైరస్ నిర్మూలనకు మోడీ ఆదేశాలతో చేపట్టిన జనతా కర్ఫ్యూకు జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ వీడ్కోలు పలికారు. ఆదివారం ఉదయం నుంచి జిల్లా అంతటా జనతా కర్ఫ్యూ దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా కర్ఫ్యూను అమలు చేశారు. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూ కొనసాగించారు. సాయంత్రం 5 గంటలకు అందరూ చప్పట్లు మోగించి డాక్టర్లకు సంఘీభావం పలకాలని సూచించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ తన క్వార్టర్స్ వద్ద సాయంత్రం 5 గంటలకు భార్య పిల్లలతో కలిసి చప్పట్లతో జనతా కర్ఫ్యూ లో చప్పట్లు కొట్టి డాక్టర్లకు సంఘీభావం పలికారు.
No comments:
Post a Comment