పెన్ పవర్, వి. మాడుగుల. మాడుగుల గ్రామంలో ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు జనతా కర్ఫ్యూ లో భాగంగా సాయంత్రం 5 గంటలకు చప్పట్లు కొట్టి డాక్టర్లకు సంఘీభావం తెలిపారు, ఈ వేడుక ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి జనతా కర్ఫ్యూ లో పాల్గొన్న వారు సాయంత్రం ఐదు గంటలకు వీధి లో చేరి చప్పట్లు మోగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుమేరకు ప్రజలు స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూ ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా చప్పట్లతో డాక్టర్లకు సంఘీభావం తెలిపారు ప్రజలు . పలు గ్రామాల్లో పెద్ద ఎత్తున జనం చప్పట్ల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నాపెద్ద తేడా లేకుండా పాల్గొన్నారు.
No comments:
Post a Comment