Followers

మార్చి 31 వరకు అన్ని రైళ్లు రద్దు.


స్టాఫ్ రిపోర్టర్  విశాఖపట్నం ( పెన్ పవర్)  మార్చి 31 వరకు  రైల్వే  అన్ని సర్వీస్లను  రద్దు చేస్తున్నట్లు  ఇండియన్  రైల్వే  ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా వైరస్  ప్రభావం వల్ల  రైల్వే సర్వీసులను నిలుపు చేస్తున్నట్లు  ఇండియన్ రైల్వే  డైరెక్టర్  అజయ్ ప్రతాప్ సింగ్  అధికారకంగా  ప్రకటించారు.  మార్చి22 నుంచి 31 వరకు  24:00 గంటలు  అన్ని సర్వీసులు  నిలిచిపోతాయని  తెలిపారు.  దూర  ప్రాంతాల ఎక్స్ప్రెస్ సర్వీసులు  ఇప్పటికే రద్దు చేశామని  ప్యాసింజర్ సర్వీసులు  మెట్రో ట్రైన్ లను కూడా  రద్దు చేస్తున్నామన్నారు. కొన్ని సర్వీసుల్లో  రిజర్వేషన్లు చేయించుకున్న వారు  జూన్ నెలలో  వారికి  వెసులు బాటు  కల్పిస్తామని  ప్రకటించారు. వైరస్  ప్రభావం  సద్దుమణిగిన తరువాత  రైల్వే  సర్వీసులు  పునరుద్ధరిస్తారు అని  సింగ్  ప్రకటించారు. ప్రయాణికులు   రైల్వే రద్దు చేసిన విషయం  తెలుసుకోవాలని  కోరారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...