Followers

17 వ వార్డులో వైసీపీ నాయకులు మాస్కుల పంపిణీ..


17 వ వార్డులో వైసీపీ నాయకులు మాస్కుల పంపిణీ..
మండపేట: కరోనా మహమ్మారిని జయించాలంటే ప్రతి ఒక్కరూ ఇంటి పట్టున ఉంటేనే శ్రేయస్కరమని సత్యవంత మెడికల్ షాప్ నిర్వాహకులు బోడా కళ్యాణ్ అన్నారు. 17 వ వార్డు వైసీపీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థి భర్త  కళ్యాణ్ ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి ఆ వార్డులో మాస్కులు పంపిణీ చేశారు. అగ్రహారం వీధి మునిసిబు గారి వీధి , రాజు గారి సుబ్బారావు గారి వీధుల్లో  ఉండే ప్రజలకు మాస్కులు పంచారు. ఈ కార్యక్రమంలో  ముమ్ముడివరపు బాపిరాజు,  పెంకే గంగాధర్, సాధనాల శివ, బోడా వీర్రాజు, రామోజు కృష్ణ, చొల్లంగి సూరిబాబు  తదితరులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...